నిజామాబాద్ : ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన సుబేదార్హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హుస్సాముద్దీన్ ను ఘనంగా సన్మానించారు.
భవిష్యత్ లో మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.