నిజామాబాద్ : సెప్టెంబర్ 5 న నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో జరుగునున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.
సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లపై టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి సభా ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఓ కేసీఆరే అని,పెద్ద ఎత్తున జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభకు తరలి రానున్నారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.