నిజామాబాద్ : జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో ‘ఇంటింటి ఆరోగ్య సర్వే’ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి హెల్త్ సర్వేకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా అని వాకబు చేశారు. ఆరోగ్యం ఎట్లా ఉందని చిన్నా, పెద్దలను ఆత్మీయంగా పలకరించారు.
సర్వేకు వచ్చే వారికి మీ కుటుంబ ఆరోగ్య వివరాలు అందిస్తే..ఏమైనా సమస్య ఉన్నట్లు తేలితే త్వరగా చికిత్స అందించడానికి వీలువవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సర్వే మీ ఆరోగ్యం కోసమే తప్పా.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకు ఏమైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. మీ దగ్గరలోని ఏఎన్ఎమ్, ఆశ వర్కర్స్ కు సమాచారం అందించాలని కోరారు.
పారిశుద్ధ్య విధుల్లో ఉన్న శానిటేషన్ సిబ్బందిని మంత్రి పలకరించారు. మీకు ఇచ్చిన సేఫ్టీ కిట్ వాడుతూ పని చేయాలని సూచించారు. సర్వే చేసే కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరిశీలించాలని వారికి సూచించారు.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి పరీక్షలు చేయండి
గంగానది ఇసుకతిన్నెల్లో బయటపడ్డ శవాలు