వేల్పూర్, సెప్టెంబర్ 18: ఓ అనాథ యువతికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన మౌనికకు తల్లిదండ్రులు లేరు. చిన్నతనం నుంచి తన బంధువుల ఇంట్లో పెరిగిన ఆమెకు ఇటీవల ఆర్మూర్కు చెందిన నిశికాంత్రెడ్డితో వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం కోసం మౌనిక భర్త నిశికాంత్రెడ్డి ఆదివారం వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి దరఖాస్తును అందజేశాడు. వెంటనే స్పందించిన మంత్రి.. అమ్మాయి తల్లిదండ్రులు రాలేదా అని నిశికాంత్రెడ్డిని ప్రశ్నించారు. ‘ఆమెకు ఎవరూ లేరు సార్.. తల్లిదండ్రులు లేరు..నేనే వచ్చానంటూ’ చెప్పడంతో మంత్రి చలించిపోయారు. వెంటనే నిశికాంత్రెడ్డితో మౌనికకు ఫోన్ చేయించి మాట్లాడారు. అమ్మా.. నీ భర్త బాగా చూసుకుంటున్నాడా.. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని భరోసా ఇచ్చారు. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చే డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మెండోరా, సెప్టెంబర్ 18: జిల్లాలో టీఆర్ఎస్లో వలసల జోరు కొనసాగుతున్నది. మండలంలోని సావెల్ గ్రామ యాదవ సంఘానికి చెందిన రాజేశ్, నరేశ్, శ్రీకాంత్, మధు, సురేశ్, గంగాధర్తోపాటు 50 మంది సభ్యులు, ఎంపీటీసీ పుప్పాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో మంత్రి వేముల సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సంపదను సృష్టించి పేదల సంక్షేమానికి అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ పథకంతో వారికి చేతి నిండా పని కల్పించారన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలను నమ్మకుండా కేసీఆర్పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ చేరికలే నిదర్శనమన్నారు. వేల్పూర్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.