బేగంపేట్ సెప్టెంబర్ 6: విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది జీహెచ్ఎంసీ ఎంటమాలజి సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని, సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్య వంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మాస్కులు, కొబ్బరినూనె, షూస్, శానిటైజర్లతో కూడిన కిట్లను అందజేశారు. కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
బేగంపేట్, రాంగోపాల్పేట్లో..
బేగంపేట్, రాంగోపాల్పేట్, బన్సీలాల్పేట్ డివిజన్లో జీహెచ్ఎంసీ అందించిన పీపీఈ కిట్లను ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల చేతుల మీదుగా జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందజేశారు.