హైదరాబాద్ : ఈ నెల 5న హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ భవన్లో సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల 5న దసరా రోజు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని, సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద, నగరంలోని అన్ని నియోజకవర్గాలు, డివిజన్లలో భారీ ఎత్తున సంబురాలు జరుపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, ఆయాచితం శ్రీధర్, గజ్జెల నగేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు.