తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో పురాతన ఆలయాలకు టీటీడీ సహకారం అదించాలన్నారు. రాజకీయ అవసరాల కోసమే బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటున్నదని విమర్శించారు. దేశ ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్కు నాయకత్వం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక బూమిక పోషిస్తారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటున్నదని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని పేర్కొన్నారు. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు.