మహబూబ్నగర్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులతో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.