మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. తెలంగా ణ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండ లం పొడిచేడులో శ్రీకాంతా చారి విగ్రహానికి మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న ఉద్యమ నేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపడితే అప్పటి ఆంధ్రా పాలకులు కుట్ర చేసి దీక్షను భగ్నం చేయడాన్ని తట్టుకోలేక శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడ్డారని తెలిపారు. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం యావత్ దేశ ప్రజలను ఉద్యమానికి మేల్కొలిపిందని పేర్కొన్నారు. నాటి అమరుల ప్రాణత్యాగాలు వృథాగా పోలేదని, వారి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతున్నారని చెప్పా రు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం తన కొడుకు ప్రాణ త్యాగం చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ తమ కుటుంబానికి అండగా ఉన్నారన్నా రు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను ఎప్పటికీ టీఆర్ఎస్ను వీడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు.
గొల్లపల్లిలో శ్రీకాంతాచారికి నివాళి
శ్రీకాంతాచారి వర్ధంతిని శుక్రవారం ఆయన స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి ఆయన తండ్రి వెంకటాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడు తెలంగాణ ఉద్యమంలో అమరుడైనా, అతని ఆశయం నెరవేరిందన్న సంతోషం ఉన్నదన్నారు.