హైదరాబాద్ : రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆమె హోం ఐసోలేషన్లో ఉంటున్నట్టు ప్రకటించారు. గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న మంత్రి సత్యవతికి ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు.