హైదరాబాద్ : మంత్రివర్గం, అధికారుల సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేసి పోడు భూముల సమస్యలను పరిష్కారం చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇచ్చారు. అంతవరకు పోడు భూములు జోలికి వెళ్లవద్దని గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆదేశాలు ఇచ్చారు. అయినా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. త్వరలోనే పోడు భూముల సమస్యకు సీఎం కేసీఆర్ సమగ్రమైన పరిష్కారము చూపుతారు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో గిరిజన రైతుల పోడు భూముల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి సమాధానం ఇచ్చారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 2008 నుంచి 303970 ఎకరాలలో అర్హులైన 94,774 మంది హక్కుదారులకు పట్టాలను ఇవ్వడం జరిగింది. ఈ చట్టం చేసినప్పటి నుంచి 6, 3, 850 ఎకరాలకు సంబంధించి 1, 84,730 క్లెయిమ్స్ అందాయి. అందులో క్షేత్రస్థాయి విచారణ చేసి అర్హులైన వ్యక్తులకు పట్టాలను జారీ చేయడం జరిగింది.
2018 నుంచి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల కోసం 27,990 క్లెయిమ్ లు 98,745 ఎకరాలకు వచ్చాయి. వాటిలో 4,248 ఎకరాల్లో 2401 క్లెయిమ్స్ అర్హత ఉన్నవని గుర్తించి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరో 40,780 సంబంధించిన ఎకరాలకు సంబంధించిన 9976 క్లెయిమ్ లను డి ఎల్ సి ద్వారా అర్హత లేనివిగా నిర్ధారించారు. 53, 565 ఎకరాలకు సంబంధించి 15,558 క్లెయిమ్ లు డి ఎల్ సి ల పెండింగ్ లో ఉన్నాయి. అటవీ భూముల్లో అభివృద్ధి పనులు కొనసాగేలా ఒక లైసన్ అధికారిని పెట్టీ సమస్యలు రాకుండా ఉండేలా ఆలోచనా చేస్తున్నాం. ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడానికి 220 కోట్ల రూపాయలు కేటాయించి, పనులు చేస్తున్నాం. గిరి వికాసం పథకం కింద వ్యవసాయేతర భూములను సాగు యోగ్య భూములుగా చేసేందుకు వ్యవసాయ ఉపకరణాలు, ఆర్థిక సాయం అందిస్తున్నాం.
నల్లమల అడవిలో అటవీ ఉత్పత్తుల కోసం వెళ్ళిన చెంచులు ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకోవడం వల్ల కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్ కు తరలించి ఉస్మానియా హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందించాం. దురదృష్టవశాత్తూ వారిలో ముగ్గురు హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాం. గాయ పడ్డ వారికి ,50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా అందించి, వారి వైద్యానికి కావలసిన పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది.
ధరణి పోర్టల్లో భూములను ఎక్కించడం, రైతుబంధు కొంతమందికి అందకపోవడం, హరితహారం కింద అడవుల్లో చెట్లను పెంచుతూ, అటవీ సంరక్షించే చర్యలు చేపట్టడం వల్ల ఆందోళన పోడు భూముల గిరిజన రైతుల్లో ఇటీవల ఆందోళన ఎక్కువ అయ్యింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు అని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.