హైదరాబాద్ : కొవిడ్-19పై పోరులో హైదరాబాద్కు చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎంతో గొప్పదన విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో ఆమె కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉదన్నారు.