నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. క్యాంపస్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థి ప్రతినిధులతో మంత్రి సబిత చర్చిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత ఏడు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం క్యాంపస్ విద్యార్థులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు నిర్వహించారు.