రంగారెడ్డి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి మంత్రి సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ బీజేపీ నాయకుల చర్యలపై విచారం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, అంజయ్యయాదవ్, రోహిత్రెడ్డి తదతరులున్నారు.
కడ్తాల్, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడంతోపాటు ఆమెపై నిరాధర ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ను కలిసి సంఘీభావం తెలిపారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం నగరంలోని ఆమె నివాసంలో ఎమ్మెల్సీని కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మహేశ్, శివప్రసాద్, అస్లాం, రాహుల్ తదితరులున్నారు.