రంగారెడ్డి: వచ్చే గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. దీని కోసం చేస్తున్న ఏర్పాట్లను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఆదివారం నాడు అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఆమె పలు సూచనలు చేశారు. సమయం తక్కువగా ఉన్నందున ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.