మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు షీ క్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి లబ్ధిదారులకు క్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తున్నదన్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే అర్హులైన ఎస్సీ మహిళలకు క్యాబ్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 23 మంది దళిత మహిళలకు షీ క్యాబ్స్ అందజేసినట్లు తెలిపారు. మహిళలు ఉపాధి పొంది కుటుంబ పోషణలో కీలకపాత్ర పోషించాలన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారుల చొప్పున దాదాపు లక్ష మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోంలో ఏర్పాటు చేసిన షీ క్యాబ్స్ పంపిణీకి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 23 మంది దళిత మహిళలకు షీ క్యాబ్స్ వాహనాలను అందజేసినట్లు తెలిపా రు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ వం టి పథకాలను ప్రవేశపెట్టి వారికి అం డగా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న మహిళలు షీ క్యాబ్స్ను వినియోగించుకునేలా.. దళిత మహిళలకు ఉపాధి కల్పించేందుకు అర్హులను ఎంపిక చేసి వారికి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి షీ క్యాబ్స్ వాహనాలను అందించిన ట్లు తెలిపారు. రాష్ట్రంలో దళితబంధు పథకం ద్వారా 38,400 మంది లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను ఇప్పించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం దోహదం చేసిందన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారుల చొప్పున దాదాపు లక్ష మంది కి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయసంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్, ఎస్బీఐ మేనేజర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్కుమార్, అధికారులు, షీ క్యాబ్స్ లబ్ధిదారులు పాల్గొన్నారు.