ఖమ్మం : నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఉదయం మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్లైన్ పనులు, రోడ్డు విస్తరణ తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, కాస్బా బజార్, పాకబండ బజార్, బోనకల్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాశ్నగర్, మార్కెట్ రోడ్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, గాంధీచౌక్, ట్రంక్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాడ్, ఆర్డీఓ కార్యాలయం, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, ఇల్లందు సర్కిల్, ఐటీహబ్ సెంటర్, మమత సర్కిల్, వరదయ్య నగర్, లకారం సర్కిల్లో మంత్రి పర్యటించారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.