భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాత బస్ డిపో దుర్గా కళా మందిర్ వరకు రూ.1 కోటితో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36వ వార్డు కూలి లైన్లో రూ.15లక్షలతో ఏర్పాటు చేసిన వీధివ్యాపారుల దుకాణ సముదాయాన్ని, 15వ వార్డు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద పట్టణ ప్రకృతి వనం, పంచతత్వ పార్క్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.