ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడిబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారం తగ్గిందన్నారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, విత్తనాభివృబ్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు, కమర్తపు మురళి, రుద్రగాని శ్రీదేవి, తోట ధనమ్మ, సరస్వతి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, బొమ్మెర రాంమూర్తి తదితరులు ఉన్నారు.