చెన్నై : తమిళనాడు మంత్రి పీకే శేఖర్బాబు ఉత్తర భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ వల్లనే తమిళనాడులోని ఉత్తర భారతీయులు ధనవంతులు అవుతున్నారని, అయితే ఎన్నికల్లో మాత్రం మాకు ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేశారని మంత్రి శేఖర్ బాబు అన్నారు. మంత్రి ప్రకటన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు తలనొప్పిగా మారనున్నది.
బుధవారం చెన్నైలోని ఒక కార్యక్రమానికి హాజరైన శేఖర్ బాబు మాట్లాడుతూ.. తమిళనాడులో నివసిస్తున్న ఉత్తర భారతీయులు డీఎంకే ప్రయత్నాల వల్ల సంపాదించి ధనవంతులు అయ్యారని, అయితే వారు ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేశారని అన్నారు. ఇప్పడే కాదు వారు 2011 నుంచి ఇప్పటివరకు మన పార్టీకి ఓటేయడం లేదన్నారు. మనకు ఓటేయనప్పటికీ వారికి సహాయపడండి.. వారు అపరాధభావంతో సిగ్గుపడేలా చేయండి అని పిలుపునిచ్చారు. వారు ఎప్పటికైనా తమ తప్పులను గ్రహించి సిగ్గుపడతారని చెప్పారు. శేఖర్ బాబు స్టాలిన్ మంత్రివర్గంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నారు.
నేర తీవ్రతను చూసి బెయిలివ్వండి: హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన
ఆఫ్ఘాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోవడం లేదు : అమెరికా
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్దారుకు 50 వేల జరిమానా..
భారత్లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..