యాదాద్రి భువనగిరి : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికి ఆయనకు స్వామి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి యాదాద్రి పునర్నిమాన పనులను పరిశీలించారు.