మరిపెడ, మే 5 : గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ్డ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ 7వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి సత్యవతి మహబుబాబాద్ వెళ్తున్నారు.
ఈ క్రమంలో జిల్లాలోని మరిపెడ కార్గిల్ స్తూపం ప్రాంతంలో మంత్రి వాహన శ్రేణికి పందుల గుంపు అడ్డువచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనాలకు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకోవడంతో గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.