హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలంలో వరదబాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కోర్ కమిటీ సభ్యులు యాదారి నరేశ్తేజ, గుండా జైవిష్ణు సమన్వయం చేశారు. దక్షిణాఫ్రికాలో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, కోర్ కమిటీ సభ్యులు మేడసాని నరేందర్రెడ్డి, హరీశ్ రంగ, చీకోటి అరవింద్, వెంకట్రావు, రేపాల శ్రీనివాస్, శ్రీనాథ్ తదితరులు కేక్ కట్చేశారు. కువైట్లో టీఆర్ఎస్ ఎన్నారైశాఖ అధ్యక్షురాలు గొడిశాల అభిలాష, తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్కుమార్, సుభాన్ సోహిల్, గన్నరపు రవి, అయ్యప్ప, ప్రమోద్కుమార్, సుధగాని రవి, అశోక్, మహమ్మద్ జలాల్ తదితరులు కేక్ కట్చేశారు.