హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము తన నామినేషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.