హైదరాబాద్ : హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై కేటీఆర్ ఆరా తీశారు. ఎస్టీపీ పనులు చేస్తున్న కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను పర్యవేక్షించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 1259 ఎంఎల్డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండకాలం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Monitored the progress of ongoing Sewerage Treatment Plant construction across various sites in Hyderabad
STPs with 1259 MLD capacity of treatment will be completed by summer 2023 making Hyderabad probably the first city to treat 100% of its sewerage pic.twitter.com/bKJrDOlD3f
— KTR (@KTRTRS) September 24, 2022