హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డికి ఉన్న అజ్ఞానాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.
మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. మోదీ కేబినెట్ మిత్రులందరూ చాలా తెలివిమంతులు.. ఇది అంగీకరించాల్సిన విషయమన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి తెలివిమంతుడు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ను మన దేశంలో మోదీనే కనుగొన్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు.
Let us demand Nobel prize in Medicine/Science to Modi Ji
Apparently Modi discovered the Covid Vaccine courageously 🤦♂️
His Cabinet colleagues are really bright I must accept; especially Kishan Reddy 😂 https://t.co/Zt37okSx49
— KTR (@KTRTRS) October 17, 2022