హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో 2019లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సుమారు 35 వేలమంది స్థానిక యువతకు ఉపాధిని అందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోందన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వరంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణరంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటు రంగంలో కూడా వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
1/3 pic.twitter.com/lpRyHiLpeY— KTR (@KTRTRS) October 24, 2022