జైనథ్, సెప్టెంబర్ 24 : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి భోజమ్మ ఇటీవల మృతిచెందగా, పరామర్శించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జైనథ్ మండలంలోని దీపాయిగూడకు రానున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్, ఆర్అండ్బీ డీఈ సురేశ్ మోడల్ స్కూల్ పక్కన హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.