విజయ్దివస్ సందర్భంగా మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విజయ్దివస్ను పురస్కరించుకొని మంత్రి కే తారకరామారావు సాయుధ బలగాల గౌరవార్థం వారికి సెల్యూట్ అని ట్వీట్ చేశారు. ‘విజయ్దివస్ సందర్భంగా భారతదేశ ధైర్యవంతులైన, మనల్ని గర్వించేలా, సురక్షితంగా ఉంచుతున్న సాయుధ బలగాల పరాక్రమానికి మనమందరం సెల్యూట్ చేద్దాం. రెస్పెక్ట్, జై హింద్, జై జవాన్” అని ట్వీట్ చేశారు. కాలిగాయం కారణంగా ఇంటికే పరిమితమైన మంత్రి కేటీఆర్ మంగళవారం పలు ఫైళ్ల పనిని పూర్తిచేశారు. ఈ మేరకు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను నెటిజన్లతో పంచుకొన్నారు
8వేలకు పైగా మెసేజ్లు.. కేటీఆర్ వాట్సాప్ బ్లాక్!
కాలి గాయం కారణంగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకొంటూ, వర్క్ ఫ్రం హోం చేస్తున్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుకు చెందిన వాట్సాప్ నంబర్ మూడుసార్లు బ్లాక్ అయ్యింది. అందుకు దారితీసిన కారణాలను కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. ‘నాకు 8వేలకు పైగా మెసేజ్లు వచ్చాయి. దీంతో నిన్నటి నుంచి మూడుసార్లు వాట్సాప్ నుంచి తొలగించబడ్డాను! వీలైనన్ని ఎక్కువ మెసేజ్లకు రిప్లయ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. కానీ గత 24 గంటలుగా వాటాప్స్ అందుబాటులో లేకుండా పోయింద’ని పేర్కొంటూ డిజిటల్ చాలెంజెస్తో అనే హాష్ట్యాగ్లో ట్వీట్ చేశారు.
ఉన్నత శిఖరాలకు రచన: మంత్రి కేటీఆర్ ఆశాభావం
తాను అందజేసిన ఆర్థిక సహాయంతో బీటెక్ పూర్తి చేసిన జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన రచనకు ఐదు బహుళజాతి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చిన నేపథ్యంలో మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు. ‘ఈ వార్త నా హృదయాన్ని బరువెక్కించింది. ఇట్స్ మేడ్ మై డే.. ఈ బ్రైట్ యంగ్ గర్ల్ రచన ఉన్నత శిఖరాలకు ఎదగబోతున్నద’ని కేటీఆర్ ట్వీట్ చేశారు.