కలెక్టరేట్, మే 16: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫోన్ చేశారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడిసిన ప్రతి ధాన్యపు గింజనూ కొంటామని స్పష్టంచేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.