ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతున్నది. వచ్చే ఏడాదినాటికి ప్రపంచస్థాయి సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఓఆర్ఆర్ పరిధిలో సోలార్ రూఫ్తో కూడిన 21 కి.మీ సైక్లింగ్ ట్రాక్కు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
ఓఆర్ఆర్ వెంట నానక్రామ్గూడ-టీఎస్పీఏ, నార్సింగి-కొల్లూరు స్ట్రెచ్లో 4.5 మీటర్ల వెడల్పులో 3 లేన్ బై-సైకిల్ ట్రాక్కు సెప్టెంబర్ 6న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు. ఇది సీసీటీవీలతోసహా అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు.