హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయి. కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఈ ఆర్యూబీని నిర్మించారు. రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి-హైటెక్సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పాయి.
ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరదనీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. భారీ వర్షాలు పడితే ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. వరదనీటిని అక్కడే నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. అందులోని నీటిని మూసాపేట సర్కిల్లో హరితహారం మొక్కలకు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..