హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మళ్లీ ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి సోమవారం శాసనమండలికి హాజరయ్యారు. ఆయనను మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు శాలువాతో సన్మానించారు. అసెంబ్లీలో తనను కలిసిన పల్లాను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు.