ఖమ్మం : ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అందరి దృష్టిని ఆకర్షించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తున్న క్రమంలో.. ఓ ఇంటిలోని నల్లాను తానే స్వయంగా ఆన్ చేసి నీళ్లను తాగారు. రాష్ర్టంలోని ప్రతి నివాస సముదాయానికి మిషన్ భగీరథ నీళ్లు అందుతున్న విషయం తెలిసిందే.
ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో రూ. 60.20 కోట్లతో నిర్మించిన 1,004 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కలిసి ప్రారంభించారు. టేకులపల్లిలో డబుల్బెడ్రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించారు.