ధర్మపురి : నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తన ఎంపీ నిధుల నుంచి రూ.22లక్షలను కేటాయించి.. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్ను సమకూర్చారు. ఈ సందర్భంగా ఎంపీ, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కుల సంఘ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేందర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు లింగాల రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గంగాధర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొల్లం రమేశ్, సింగిల్ విండో చైర్మన్ మాధవరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.