హైదరాబాద్ : అంతిమ విజయం ఎప్పటికీ ధర్మం వైపు నిలబడుతుంది రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అదే ధర్మం తోడ్పడిందని తెలిపారు. విజయదశమి సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా గోదావరిఖనిలోని జయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినమన్నారు.
ధర్మం గెలిచిన రోజును పర్వదినంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ధర్మ యుద్ధంలో విజేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాదించిందాన్నారు. అదే ప్రగతి యావత్ భారతదేశానికి విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, అలాంటి ధర్మ పోరాటంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.