జగిత్యాల : స్పందించే హృదయం ఉండాలే కానీ పనులు పూర్తైయేందుకు ఎంతసేపు. అడిగింది, కోరింది చెంతకు చేరేంత సేపే. అన్నీ పనులు కాకపోయిన కొన్ని పనులు మాత్రం ఈ విధంగానే జరిగిపోతుంటాయి. ఈ విషయాన్నే రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరూపించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చెందోళీ గ్రామంలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామ వాస్తవ్యురాలు, పుట్టుకతోనే దివ్యాంగురాలైన వేముల రాజవ్వ మంత్రిని కలిసి తన బాధను వివరించి బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాల్సిందిగా కోరింది. తక్షణమే స్పందించిన మంత్రి గ్రామ పర్యటన పూర్తికాక ముందే రెండు గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయికి బ్యాటరీ ట్రై సైకిల్ను తెప్పించి అందజేశారు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలపగా గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గుల్లకోట సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి, చందోళి సర్పంచ్ రవిందర్, ఉప సర్పంచ్ రమేష్, ఎంపీపీ నక్క శంకర్, జెడ్పీటీసీ గోస్కుల జలెందర్, పీఏసీఎస్ ఛైర్మన్ లు, రాజ సుమన్, మాధవరావు, మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.