వాన బాధితులకు మంత్రి ఈశ్వర్ భరోసా
నంది మేడారంలో 50 మందికి రూ. 2.50 లక్షల సాయం
ధర్మారం, జూలై 20: మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. నందిమేడారంలో నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న పరామర్శించి, ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు 50 మందికి వ్యక్తిగతంగా రూ. 5 వేల చొప్పున రూ. 2.50 లక్షల సాయం అందజేశారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నందిమేడారం సర్పంచ్ సామంతుల జానకీ శంకర్, ఎంపీటీసీలు కట్ట సరోజా స్వామి, మిట్ట తిరుపతి. ఉప సర్పంచ్ కట్ట రమేశ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాసూరి రాజ్కుమార్, నాయకులు ఆవుల రాజయ్య, సామంతుల నర్సింగం, మిట్ట భరత్, హరీశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.