నల్లగొండ : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జానానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరంశోభా యాత్రను ప్రారంభించారు.
ఉమ్మడి నల్లగ్డొ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 10-20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, జెడపీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులు ఉన్నారు.