హయత్నగర్, సెప్టెంబర్ 28: ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ నూతన చైర్మన్గా ఎల్ శ్రీకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సం దర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలన పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయో వాళ్లు సరైన రీతిలో పనిచేయగలిగితే సంస్థలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తాయని పేర్కొన్నారు.
మదర్ డెయిరీ సొసైటీ ప్రభుత్వ సంస్థగా ఏర్పడిందని, పాడి రైతుల వద్ద సేకరించిన పాల ఉత్పత్తులను మార్కెట్లో సరైన పద్ధతుల్లో విక్రయిస్తే లాభాలు అధికంగా వస్తాయని అన్నారు. సంస్థ బ్రాండ్కు సరైన పద్ధతుల్లో మార్కెటింగ్ పెంచి ప్రజల్లో విశ్వాసం నింపాలని సూచించారు. చైర్మన్, పాలకవర్గ సభ్యు లు సంఘటితంగా ఉద్యోగులను కాపాడుకుంటూ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి లా భాల బాటలో ముందుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, పైళ్ల శేఖర్రెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఎండీ అశోక్ కుమార్, అధికారులు, పాలకవర్గ సభ్యులు, పాడిరైతులు పాల్గొన్నారు.