నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు, సీపీఎం నల్లగొండ, యాదాద్రి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జహంగీర్, సీపీఐ నల్లగొండ, యాదాద్రి జిల్లాల కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.