హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ సీట్లు వచ్చినా కుటుంబ పరిస్థితి కారణంగా ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న అన్నాచెల్లెళ్లకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ములుగు జిల్లాకు సానియాకు కాకతీయ మెడికల్ కాలేజీలో, షోయబ్కు రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కుటుంబానికి ఆధారమైన తండ్రి పోయిన సంవత్సరం కరోనాతో మరణించాడు. ఫీజు కట్టే స్తోమత లేకపోవడంతో తల్లి జహీరా బేగం దాతలను ఆశ్రయించింది. విషయం ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు దృష్టికి రావడంతో తక్షణం స్పందించారు. ఆ అన్నాచెల్లెళ్ల వైద్యవిద్య కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తల్లి వెంటరాగా సానియా, షోయబ్లిద్దరూ శనివారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాగా చదివి మంచి వైద్యులు కావాలని, పేదలకు సేవ చేయాలని వారిద్దరికీ మంత్రి సూచించారు.