హైదరాబాద్: అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనం చనిపోయినా అవయవదానం ద్వారా ఇతరుల రూపంలో జీవించే ఉంటామని చెప్పారు. అందువల్ల అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతూ ట్వీట్ చేశారు. ‘అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి బతకడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ప్రజలు అవయవాలను దానం చేడానికి తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
Donating organs give someone an another chance to live life.
On the eve of #WorldOrganDonationDay, I request people to register for organ donationRegister https://t.co/iZseKdzjFS pic.twitter.com/WKHNTVUahg
— Harish Rao Thanneeru (@trsharish) August 13, 2022