హైదరాబాద్ : నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ పరామర్శించారు. ఇటీవలే డాక్టర్ మనోహర్ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య వివరాలను మంత్రి హరీశ్రావు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.