రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్లో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించనున్నారు. వీటికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇక్కడి శివాలయం పక్కన స్వచ్ఛ భారత్ సృష్టి కర్త సంత్ గాడ్గే బాబాల విగ్రహాన్ని కూడా మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మెదక్ పట్టణం వెల్కమ్ బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కుడా ఆవిష్కరించారు. అంతకు ముందు 50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న దోబీ ఘాట్కు శంకుస్థాపన చేశారు. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో 44 లక్షల రూయాలు పెట్టి కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు.