సిద్దిపేట :
కాళేశ్వరం నీళ్లతో జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు పారింది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు గంగమ్మ తల్లికి జల హారతి పట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరు అందించే క్రమంలో కాలువ ద్వారా నీళ్లను వదిలారు. దీంతో గత ఐదు రోజులుగా చెరువు మత్తడి దుంకుతున్నది. అనంతరం మంత్రి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.