మాజీమంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగుబోజమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా ఆదిలాబాద్ లోని జోగు రామన్న ఇంటికి వెళ్లి ఆయనతోపాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. జోగు రామన్నను పరామర్శించి వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా జోగుబోజమ్మ గారి చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పూలు జల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.