అబద్ధం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నట్టు పలు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం.
నిజం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సన్నబియ్యమే పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నామని పలు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఓ ప్రకటనలో ఖండించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రతినెలా పాఠశాలలకు 3 వేల టన్నులు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు 14 వేల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని వివరించారు. పాఠశాలల నిర్వాహకులు, ఎంఈవోలు, హాస్టల్ ఇన్చార్జీల సమక్షంలోనే గోదాముల వద్ద బియ్యం నాణ్యతను పరిశీలన కొనసాగుతున్నదని, వారు అనుమతిచ్చాకే బియ్యం బయటకు వస్తున్నదని వెల్లడించారు.