కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజు అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి యాంకర్గా శ్యామల వ్యవహరించగా, సినీ నటుడు ప్రకాష్ రాజ్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు విజయ, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి – హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సీపీ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, అడిషనల్
డిసీపీ చంద్రమోహన్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఈ సందర్భంగా కళాకారులు మాట్ల తిరుపతి, ఆర్ఎస్ నంద, స్వర్ణ,పద్మావతి, కనుకవ్వ, బుర్ర సతీశ్, సౌమ్య, శాంతిరాజ్, మాలిక్ తేజ, కందుకూరి శంకర్, గడ్డం రమేశ్, పొద్దుపొడుపు శంకర్, అశ్విని రాథోడ్, నాగదుర్గ, జానులిరి, అమూల్య తదితరుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఇజ్రాయిల్, తమిళనాడు, పంజాబ్ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖులతోపాటు తారా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్, కళోత్సవ కమిటీ సభ్యులు రోజా రమణి, మిట్టపల్లి సురేందర్, శ్రీనివాస్, ప్రవీణ్, గోగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.