హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. ఈ ఏడాది ఆటా వేడుకలను మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వివిధ ఏర్పాట్ల కోసం వందలాదిగా వలంటీర్లు 80 కమిటీలుగా ఏర్పడి శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.